#raitunestham #livestock
కేవలం పంటల సాగుతోనే వ్యవసాయంలో అనుకున్న లాభాలు సాధించలేం. పంటలతో పాటు పాడి, జీవాల పెంపకం చేపడితేనే కష్టానికి తగిన లాభాలు ప్రతి రైతుకి దక్కుతాయి. ఇలా సమగ్ర సేద్యంలో సాగుతోన్న రైతులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇచ్చి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి విధానాల్లో భాగంగానే... ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (National Live Stock Mission NLM). ఈ స్కీమ్ కింద.. ఔత్సాహిక రైతులకి ప్రభుత్వం రూ. 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. మేకలు, గొర్రెలు, కోళ్లు తదితర జీవాల పెంపకం కోసం ఈ రాయితీ ఇస్తుంది. ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన సేంద్రియ రైతు అనుముల రామిరెడ్డి... ఈ పథకం కింద లబ్ధి పొంది... భారీ స్థాయిలో గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, బ్యాంకు ప్రక్రియ, దరఖాస్తు తదితర వివరాలను రామిరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం..
మరింత సమాచారం కావాలంటే రామిరెడ్డి గారిని 94403 54113 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కింద వెబ్ సైట్ ని సందర్శించండి
https://nlm.udyamimitra.in/
☛ Subscribe for latest Videos • Inter and Intra Row Weeder | ఒకేసారి ...
☛ For latest updates on Agriculture http://www.rythunestham.in/
☛ Follow us on / raitunestham
☛ Follow us on / rytunestham